మునిసిపల్ కార్మికులకు వైద్య శిబిరం

మునిసిపల్ కార్మికులకు వైద్య శిబిరం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ పురపాలక సంఘం పరిధిలోని 74 మంది కార్మికులకు స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, ఈ - శ్రీ గ్రీన్ వర్క్స్ ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ సహకారంతో స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో రాం నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్వేత, సూపర్వైజర్ మతీన్, పి హెచ్ ఓ రమణ, జన, లక్ష్మి, స్వరూప, వెంకట స్వామి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ శ్రీ గ్రీన్ వర్క్స్ అధికారులు కిఫాయత్ ఖాన్,శరత్ చంద్ర, మంజూష తదితరులు పాల్గొన్నారు.