కౌంటింగ్ కేంద్రాన్ని వీడిన మంత్రి ఇంద్రకరణ్

కౌంటింగ్ కేంద్రాన్ని వీడిన మంత్రి ఇంద్రకరణ్

 ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజక వర్గ కౌంటింగ్ లో ప్రతి రౌండ్లో ఆధిక్యాన్ని చూపుతున్న బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డితో మిగిలిన అభ్యర్థులు ఏ ఒక్క రౌండ్లో కూడా పోటీ పడలేక పోయారు. తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి 30 వేలకు పైగా మెజారిటీ రావటంతో బీ ఆర్ ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన అనుచరులు కౌంటింగ్ కేంద్రాన్ని వీడి వెళ్ళిపోయారు.