మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జూపల్లి

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జూపల్లి

ముద్ర.వీపనగండ్ల:- మండలంలోని కల్వరాల గ్రామానికి చెందిన హమాలీ కార్మికుడు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గొల్ల పెద్దయ్య  గత పది రోజుల క్రితం రోడ్ ప్రమాదంలో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి  జూపల్లి కృష్ణారావు  గొల్ల పెద్దయ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.పెద్దయ్య కుమార్తె ఝాన్సీ పై చదువులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ప్రమాదంలో గాయపడిన మృతుడు పెద్దయ్య భార్య శావనమోని రత్నమ్మ కు మెరుగైన చికిత్స కొరకు నిమ్స్ హాస్పిటల్ కు వెళ్ళాలని సూచించారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉసేన్, నాయకులు వెంకట్రాజయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.