అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడిని పరామర్శించిన మంత్రి జూపల్లి

అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడిని పరామర్శించిన మంత్రి జూపల్లి
ముద్ర.వీపనగండ్ల:-ఉమ్మడి మండల పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన రాముడు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని  సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆస్పత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.చిన్నంబావి మండలం గూడెం గ్రామానికి చెందిన రాముడు  హైద్రాబాద్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ లో బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతూ గత మూడు రోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.మండల నాయకులు కొత్త కళ్యాణ్ రావు ఈ విషయాన్ని మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లగా హాస్పిటల్ కి వెళ్లి బాధితుడు రాముడు ని పరామర్శించి వారికి మనో దైర్యం కల్పించి వైద్యులతో మాట్లాడి  మెరుగైన చికిత్స అందించాలని వారికి సూచించారు,కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ ఉన్నారు.