రేపు మంచిర్యాల కు మంత్రి కేటీఆర్

రేపు మంచిర్యాల కు మంత్రి కేటీఆర్

పలు అభివృద్ది కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : రాష్ట్ర పురపాలక, ఐ టీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో పర్యటించనున్నారు. ఆదివారం మంత్రి పర్యటన ఉంటుందని భావించిన ప్పటికి రేపటికి ఖరారైంది. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో కేటీఆర్ జిల్లాకు రానున్నారు. ఉదయం పదకొండు గంటలకు కాసిపేట మండలంలోని దేవాపూర్ సిమెంట్ కంపెనీకి చేరుకుంటారు. కంపెనీ విస్తరిస్తున్న నూతన ప్లాంట్ కు శంఖుస్థాపన చేస్తారు.

అనంతరం బెల్లంపల్లి కి రోడ్డు మార్గంలో చేరుకుని ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ను కేటీఆర్ ప్రారంభిస్తారు. అలాగే అర్బన్ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరాను ప్రారంభించిన తర్వాత పన్నెండున్నరకు ఏఎంసీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుపేదలకు ఇండ్ల పట్టాలు, పంపిణీ చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇంట్లో భోజనం చేసి రామగుండంకు వెళ్తారు. మంత్రి కేటీఆర్ తో పాటు హోమ్ శాఖ మంత్రి మెహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నారు.