రైతుల పేరిట రాజకీయాలొద్దు

రైతుల పేరిట రాజకీయాలొద్దు
  • ఎంపీ సీట్ల కోసం కేసీఆర్ మొసలి కన్నీరు
  • కాళేశ్వరంతో చుక్క నీరు రాలేదు
  • రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు
  • ఇచ్చిన హామీలు తప్పక అమలు చేస్తాం
  • ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రైతుల పేరిట ప్రతి పక్షాలు రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు హీతువు పలికారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో కొంత పంట నష్టం జరిగితే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిఆర్ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేటు అన్నారు. అధికారంలో ఉన్న పది సంవ త్సరాలపాటు రైతుల ను పట్టించుకోని కేసీఆర్ ఎంపీ సీట్ల కోసం దొంగ కన్నీరు కారుస్తున్నారన్నారు.

రైతు సంక్షేమానికి పెద్ద పీట కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. టేలండ్ ప్రాంత రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు తమ ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని ప్రాంతానికి చుక్క నీరు కూడా రాలేదని, మూడు పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్టు ఉనికికి ప్రమాదం ఏర్పడిందని ఈ పాపం గత ప్రభుత్వా నీది కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు గత ప్రభుత్వం ఫిబ్రవరి, మార్చ్ మాసాల్లో వినియోగించిన కరెంట్ కంటే ఎనిమిది శాతం అధికంగా కరెంటు కొనుగోలు చేసి మరీ సరఫరా చేస్తున్నామన్నారు. ఎక్కడా విద్యుత్ కోతలు లేవన్నారు. 

రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరతలు లేవని, ప్రతిపక్షాలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి జీరో బిల్లు అందిస్తామన్నారు. సాంకేతిక సమస్య లతో జీరో బిల్లు రాకుంటే సంబంధిత ఎంపీడీవో కార్యాలయం తో పాటు మున్సిపల్ కార్యాల యంలో సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాల న్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న వినియోగదారులు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని, బిల్లు కట్టకుండా వారి సరఫరాను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.

రైతులను ఆదుకుంటామని, ప్రకృతి వైపరీత్యం వల్ల కొంత పంట నష్టం జరిగిందని, నిజంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తమ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఇప్పటికే 35 కోట్ల ఫ్రీ టికెట్లు జారీ చేశామన్నారు. 500 రూపా యలకే సిలిండర్ అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచామని పెద్దపెల్లి జిల్లాలో 15 కోట్ల రూపాయల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకున్నారన్నారు. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ఆరు గ్యారెంటీలో ప్రతి పథకానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తామన్నారు.

ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చింది కేసీఆరే గత్ బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనుఅతలాకుతలం చేసిందని, తమ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన నాటి నుండి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఐదు సంవత్సరాలలోపు ప్రతిపాక రిజర్వాయర్ను పూర్తి చేస్తామన్నారు. సమాజంలో నాలుగోపిల్లర్ గా ఉన్న జర్నలిస్టులకు ఎన్నికల అవగానే ఇంటి స్థలాలు, ఇండ్ల మంజూరు పై నిర్ణయం తీసుకుం టామన్నారు. "ఫోన్ టాపింగ్ అతిపెద్ద నేరమని, చట్టానికి ఎవరూ అతీతులు కారని తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు అన్నారు. తాము ఆరోపిస్తే కాంగ్రెస్ ఆరోపిస్తుందని గగ్గోలు పెడతారని, కానీ బారాస పార్లమెంటు అభ్యర్థి కడియం కావ్య లిక్కర్ స్కాం ౦ఫోన్ టాపింగ్ ఇతర అవినీతి ఆరోపణలపై ప్రజలకు జవాబు చెప్పలేక పోతున్నామని పోటీ నుండి తప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. మీడియా సమావేశంలో పెద్దపెల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమ ణారావు, మక్కన్ సింగ్ తో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.