మైనార్టీ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా ఎండి.  ఇంతియాజ అహ్మద్

మైనార్టీ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా ఎండి.  ఇంతియాజ అహ్మద్

ముద్ర ప్రతినిధి భువనగిరి :మైనార్టీ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా ఎండి.  ఇంతియాజ అహ్మద్ ఏపిగ్రీవంగా ఎన్నికయ్యారు.
గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లాలో   మైనార్టీ జర్నలిస్టు  జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ ఖాజా, మొహమ్మద్ ఇబ్రహీం, ఆధ్వర్యంలో మైనార్టీ జర్నలిస్టు ఫెడరేషన్ నూతన జిల్లా కమిటీ అధ్యక్షులుగా మహమ్మద్ ఇంతియాజ్ హైమద్  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని మైనార్టీల జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని  వారి సంక్షేమ అభివృద్ధి కోసం ఎల్లవేళలా పనిచేస్తానని తెలిపారు . మైనార్టీ జర్నలిస్ట్ లకు  ఇళ్లస్థలాలు  ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు .నా ఎన్నికకు సహకరించిన మైనార్టీ జర్నలిస్టు మిత్రులందరికీ  ధన్యవాదాలు తెలిపారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా మహమ్మద్ ఖాజా, జిల్లా గౌరవ సలహాదారులుగా మహమ్మద్ ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శిగా చిన్నబత్తిని మత్యాస్, కోశాధికారిగా మహమ్మద్-ఖాజా పసియోద్దీన్, ఉపాధ్యక్షులుగా నల్ల వేణు, మొహమ్మద్ షానూర్, ఇస్తియాక్ అహ్మద్, సుజావుద్దీన్, సహాయ కార్య దర్శులుగా షేక్ రషీద్, భైరపాక సీరిల్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ ఫిరోజ్, మహమ్మద్ భాయ్, ప్రచార కార్యదర్శలుగా జాకీర్ హుస్సేన్, సయ్యద్ జహంగీర్, జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.