మద్దుట్లలో మహిళ మిస్సింగ్

మద్దుట్లలో మహిళ మిస్సింగ్

 ముద్ర, మల్యాల : మండలంలోని మద్దుట్ల గ్రామానికి చెందిన కట్ట పద్మ (40) అనే మహిళ అదృశ్యమైంది. శుక్రవారం ఉదయం ఇంటి వద్ద నుండి పొలం కు వెళ్లిన పద్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. భర్త శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 8712686830, 8712656818 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్ఐ రహీం తెలిపారు.