విద్యకు మరింత ప్రాధాన్యత - ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

విద్యకు మరింత ప్రాధాన్యత - ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నియోజకవర్గంలో విద్యా రంగం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలోని అనసూయ పవర్ నగర్ లో  మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.61 నిధులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్శీకర్ శ్రీనివాస్ సేవలు అభినందనీయమన్నారు.అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు.కార్యక్రమంలోఎంపీపీ అబ్దుల్ రజాక్, మండల విద్యాధికారి సుభాష్ , జెడ్పీటీసీ  సోలంకే భీమ్ రావ్, మాజీ మున్సిపల్ చైర్మన్  గంగాధర్, పట్టణ బిజెపి అధ్యక్షులు మల్లేష్, కౌన్సిలర్ లు  దిలీప్, రావుల పోశెట్టి, వడ్నప్ శ్రీనివాస్,  నాయకులు తుమొల్ల దత్తాత్రి, లింగురాం, పి ఆర్ టి యు ఎస్ టి యు సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.