మోటార్ సైకిళ్ళ దొంగ అరెస్ట్

మోటార్ సైకిళ్ళ దొంగ అరెస్ట్
  • 15 మోటార్ సైకిళ్ళు స్వాధీనం

ముద్ర ప్రతినిధి , కోదాడ :- కోదాడ , హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో గత రెండు సంవత్సరాల నుండి మోటార్ సైకిళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న గుండు ఆంజనేయులు అనే వ్యక్తిని గురువారం కోదాడ పోలీసులు అరెస్ట్ చేసి  15 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వివరాలలోకి వెళితే గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన గుండు ఆంజనేయులు అనే వ్యక్తి భార్య వదిలి వెళ్లిపోవడంతో జులాయిగా తిరుగుతూ విలాసాలకు అలవాటు పడి మోటార్ సైకిళ్ల దొంగతనం ప్రారంభించాడు.

కోదాడ పట్టణ పరిధిలో 9 మోటార్ సైకిళ్ళు , మునగాల పోలీస్ పరిధిలో 01, నడిగూడెం పోలీస్ పరిధిలో 01, అనంతగిరి పోలీస్ పరిధిలో 02, హుజుర్ నగర్ పోలీస్ పరిధిలో 02 మొత్తం 15 మోటార్ సైకిళ్ల ను దొంగలించాడు . గురువారం మధ్యాహ్నం కోదాడలో రంగా థియేటర్ చౌరస్తా వద్ద పోలీసుల తనిఖీలో అనుమాన స్పదంగా ఉన్న ఆంజనేయులును అదుపులోకి తీసుకోని విచారించగాతానూ చేసిన దొంగతనాలు వెల్లడించాడు .  నిందతుడి వద్ద నుండి మొత్తం 15 మోటార్ సైకిళ్ళు రికవరీ చేసినట్లు కోదాడ సిఐ రాము వెల్లడించారు . కేసును చేధించిన పోలీసులను కోదాడ డిఎస్పీ ప్రకాష్ అభినందించారు .