ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడుగా మోటూరి రాజు

ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడుగా మోటూరి రాజు

ముద్ర, కోరుట్ల: కోరుట్ల పట్టణంలో ఆర్య వైశ్య సంఘ నూతన కమిటీ అధ్యక్ష పదవికి ఆదివారము ఎన్నికలు జరగాయి. అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ చేయగా మొత్తం 1603 ఓట్లకు గాను 980 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బచ్చు శ్రీనివాస్ 367, నీలి మధుసూదన్ 137, మోటూరి రాజు 472 ఓట్లు వచ్చాయ్.  

ఈ ఎన్నికల్లో మోటూరి రాజు 106 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. ఈ సందర్భంగా  నూతనం గా ఎన్నికైన రాజు కు ప్రధాన ఎన్నికల అధికారి శక్కరీ వెంకటేశ్వర్లు ద్రువీకరణ పత్రoను అందించగా ఎన్నికల సహయకులుగా శక్కరి అశోక్, మోటూరి ప్రవీణ్, సిరూప పూర్ణచందర్, ముత్యపు హరిప్రసాద్, ఎనుగందుల శ్రీనివాస్ లు వ్యవహారించారు.  గెలిచిన రాజుకు  వైశ్య సంఘ నాయకులు, మిత్రులు శాలువాతో ఘనంగా సన్మానించారు.