శ్రీనివాస్ రెడ్డికి ముద్ర జర్నలిస్టుల అభినందనలు
ముద్ర న్యూస్ బ్యూరో: హైదరాబాద్: రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా నియమితులైన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు)
అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డిని ‘ముద్ర’ దినపత్రిక బృందం మంగళవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా ముద్ర ఎడిటర్ వై.నరేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎలిమినేటి ఇంద్రారెడ్డి.. శ్రీనివాస్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ విభాగాల ఇంఛార్జీలు, పాత్రికేయులు పాల్గొన్నారు.