సీఎం రేవంత్ తో మునిసిపల్ చైర్మన్ భేటీ

సీఎం రేవంత్ తో మునిసిపల్ చైర్మన్ భేటీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన నిర్మల్ మునిసిపల్ చైర్మన్ జి ఈశ్వర్ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సోమవారం కలిశారు. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నారన్న ఊహాగానాలు వెలువడుతున్న నేపధ్యంలో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వెంట డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు కూడా ఉన్నారు.