వాటర్ ట్యాంకుల ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి 

వాటర్ ట్యాంకుల ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని తాగునీటి ట్యాంకులను మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. త్రాగునీటి ట్యాంకు వద్ద అపరిశుభ్రంగా ఉన్న వాటిని, లీకేజీల ను పరిశీలించి రిపేర్ చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ అధికారులకు సూచించగా  అప్పటికప్పుడు  25 సంవత్సరం క్రితం నిర్మాణం చేపట్టినవి లీకేజీ ఉందని గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించారు.

పట్టణ ప్రజలకు నిత్యం అందించే తాగునీటి ట్యాంకులను 15 రోజుల కొకసారి శుభ్రపరచాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయంలో జగిత్యాల పట్టణంలోని 6,9, 25 వార్డు ప్రజలు ఆయా వార్డులలోని సమస్యలఫై చైర్ పర్సన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలను పరిష్కరించాలని చైర్ పర్సన్ జ్యోతి అధికారులను ఆదేశించారు