Nara Lokesh - మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్
![Nara Lokesh - మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_6679075f5e9ca.jpg)
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఎపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు మంత్రులు బాధ్యతలు కూడా స్వీకరించి ఆయా శాఖల కార్యకలాపాలపై దృష్టి సారించారు.ఈ నేపథ్యంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఏపీ సచివాలయం నాలుగో బ్లాక్ రూమ్ నంబర్ 208లోని తన ఛాంబర్లో మొదట నారా లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు.అంతకు ముందు సచివాలయానికి చేరుకున్న లోకేశ్కు పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు