వెల్గటూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నాయకుల నిరసన...

వెల్గటూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నాయకుల నిరసన...

వెల్గటూర్, ముద్ర: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో మాట్లాడిన మాటలను కేటీఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటు వెల్గటూర్ లో గల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట, రాష్ట్ర రహదారి పై కాంగ్రెస్ నాయకులు నిలబడి బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు 24 గంటల విద్యుత్తు ఇస్తున్నామని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ అతిపెద్ద విద్యుత్ స్కాం చేస్తున్నారని అన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో జరిగే అవినీతిని ఎక్కడ బట్టబయలు అవుతుందో అనే ఉద్దేశంతో కేటీఆర్ మరియు టిఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతులకు ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన మొదటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో వెల్గటూర్ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, ముత్తునూర్ ఎంపీటీసీ అనుమాల మంజుల, నాయకులు గండ్ర శ్రీకాంత్ రావు,గుండేటి సందీప్ రెడ్డి, పుధారీ రమేష, బందెల ఉదయ్ గౌడ్, కుశ లక్ష్మణ్ దుంప్తట సత్యం, బొడకుంటి రాజయ్య, కొత్త హరీష్, మేకల పోచయ్య , నల్ల తిరుపతి, గొల్ల తిరుపతి,పోలోజు శ్రీనివాస్, సోమిసెట్టి రమేష్, గెల్లు శ్రీనివాస్ , దావుల శశి , బిశవెని హరీష్ మహేష్ గడ్డం తిరుపతి అజయ్, నరేష్, రకేష్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.