బిజెపి మోర్చాల సంయుక్త సమావేశం

బిజెపి మోర్చాల సంయుక్త సమావేశం

 ముద్ర, జమ్మికుంట భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ అసెంబ్లీ స్థాయి మోర్చాల సంయుక్త సమావేశం జమ్మికుంట పట్టణంలోని శంకర్ నందన గార్డెన్ లో సభ నిర్వహించడం జరిగింది.బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి గార్లు పాల్గొని మాట్లాడుతూ బిజెపి పార్టీకి మోర్చాలు పట్టుకొమ్మలని మోర్చాలు బలంగా ఉంటేనే పార్టీ ముందుకు సాగుతుందని, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 9 సంవత్సరాల సూపర్ పాలన దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి మన పథకాలను ముందుకు తీసుకెళ్లాలని చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు. బిజెపి జాతీయ కార్యకర్త సభ్యుడు హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలని అప్పుడే పార్టీ ముందుకెళుతుందని, కొంతమంది పనిగట్టుకొని పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి వాటిని కార్యకర్తలు తిప్పి కొట్టాలని అన్నారు.