ఖర్గే కు నిర్మల్ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు స్వాగతం

ఖర్గే కు నిర్మల్ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు స్వాగతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నాగపూర్ లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు  ఎంపీ మల్లికార్జున్ ఖర్గే  మహారాష్ట్రలోని నాగపూర్ కు గురువారం చేరుకున్నారు.  ఆయనకు ఎయిర్ పోర్ట్ లో నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఆవిర్భావ వేడుకల సభ్యులు కూచాడి శ్రీహరి రావు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన స్వాగతం పలికారు.