మల్యాల ఎంపీపీ పై అవిశ్వాసం తీర్మానం

మల్యాల ఎంపీపీ పై అవిశ్వాసం తీర్మానం

ముద్ర, మల్యాల:-మల్యాల బీఆర్ఎస్ ఎంపీపీ మిట్టపల్లి విమల పై అవిశ్వాస తీర్మానం చేస్తూ తీర్మానం కాపీ ని జిల్లా ఆర్డీవో కు బుధవారం లిఖితపూర్వకంగా అందజేశారు. 10మంది ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. గత నాలుగు సంవత్సరాల నుండి జరుగుతున్న మండల అభివృద్ధి కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని సన్నద్ధమయ్యారు. ఈ మేరకు ఎంపీపీ మిట్టపల్లి విమల పై అవిశ్వాస తీర్మారాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 (5) చట్టం, సెక్షన్ 263 ప్రకారం తమ హక్కులను నెరవేరుస్తూ అవిశ్వాస తీర్మారాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ, ఎంపీటిసి లు ఉన్నారు.