ఏ ఒక్క ఎమ్మెల్యేనూ పొగొట్టుకోవాలని అనుకోవడంలేదు
ఏ ఒక్క ఎమ్మెల్యేనూ పొగొట్టుకోవాలని అనుకోవడంలేదని ఏపీ సీఎం జగన్ అన్నారు. అందరినీ మళ్ళీ గెలిపించాలన్నదే తన తాపత్రయమన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగవని వర్క్షాపులో స్పష్టం చేశారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు రిప్రజెంటేటివ్ శాంపిల్ కాదన్నారు. టీడీపీ వాపును బలంగా భావిస్తోందని విమర్శించారు.