పానుగల్ ఈదమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన

పానుగల్ ఈదమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన

ముద్ర,పానుగల్:- పానుగల్ మండల కేంద్రంలో ఈ నెల 6 న నిర్వహించే పానుగల్ ఈదమ్మ జాతర ఏర్పాట్లను శనివారం తహసిల్దార్ అశోక్,ఎంపీడీవో రఘురామయ్య,సీఐ నాగభూషణం రావు, ఎస్ఐ వేణు లు పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. జాతరలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు.జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ హైమావతి, గ్రామ ప్రత్యేకాధికారి లక్ష్మీ కుమార్, పంచాయతి కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు.