రహదారుల మరమ్మత్తులు ఏవి పట్టించుకోని అధికారులు

రహదారుల మరమ్మత్తులు ఏవి పట్టించుకోని అధికారులు

ముద్ర, జమ్మికుంట:-జమ్మికుంట పట్టణంలోని జమ్మికుంట నుండి వీణవంక వెళ్లే ప్రధాన రోడ్డు ఒక నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బ తినడంతో ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు ,ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని ప్రయాణం చేసే వారి ఇబ్బందులు తొలగించాలని వేడుకుంటున్నారు. జమ్మికుంట, వీణవంక మండలాల మీదుగా కరీంనగర్ వెళ్లే ప్రయాణికులు ఈ మార్గం మీదుగా ఎక్కువ మొత్తంలో రాకపోకలు కొనసాగిస్తారు. రోడ్డుకు ఇరువైపులా లోతైన గండ్లు ఉండడం వల్ల  రాత్రి వేళలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రోడ్డుపై ఇసుక లారీలు,  వ్యానులు, బస్సులు ఎదురెదురుగా వస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.