మంత్రిని కలిసిన పిఎసిఎస్ చైర్మన్ జుట్టు కొండ. 

మంత్రిని కలిసిన పిఎసిఎస్ చైర్మన్ జుట్టు కొండ. 

ముద్ర న్యూస్ గరిడేపల్లి: మండలంలోని రాయిని గూడెం పిఎసిఎస్ చైర్మన్ గా ఎన్నికైన జుట్టుకొండ సత్యనారాయణ హైదరాబాదులో భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన ఎన్నికకు సహకరించిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు, పిఎసిఎస్ అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. అనంతరం మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ తో కలిసి మంత్రిని సత్కరించి , పుష్ప గుత్యాన్ని అందజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కత్తి సైదులు తదితరులు పాల్గొన్నారు.