మరోసారి డేరింగ్‌ స్టంట్‌ చేసిన ప్రధాని మోదీ...

మరోసారి డేరింగ్‌ స్టంట్‌ చేసిన ప్రధాని మోదీ...

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గుజరాత్‌లోని పంచకుయ్ బీచ్‌లో అరేబియా సముద్ర తీరంలో నీటి అడుగుకు వెళ్లి స్కూబా డైవింగ్‌ను ఆస్వాదించారు.నీటిలో మునిగి ఉన్న పురాతన ద్వారకలో ప్రార్ధనలు చేసిన ప్రధాని మోడీ దీనిని 'చాలా దివ్యమైన అనుభవం' అని పేర్కొన్నారు.

నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవం. అని ఎక్స్ లో షేర్ చేసిన ఓ పోస్టులో చెప్పుకొచ్చారు.మోదీ స్కూబా డ్రైవింగ్ తరువాత ఆ ఫొటోలను షేర్ చేశారు. తన అనుభవాన్ని ఇలా రాసుకొచ్చారు. ‘‘ఆధ్యాత్మిక వైభవాన్ని చూశాను. కాలాతీత భక్తిని ఆస్వాదించాను. పురాతన యుగానికి కనెక్ట్ అయ్యాను. భగవాన్ శ్రీ కృష్ణుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు" అని  ప్రధాని పేర్కొన్నారు.