మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం

మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం
Palabhishekam for Modi Photo

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: సింగరేణి సంస్థ మనుగడ కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 1650 కోట్ల  రూపాయల నిధులను కేటాయించిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబల్లి రఘునాథరావు తెలిపారు. శుక్రవారం నస్పూర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర బడ్జెట్ అందరికి ఆమోదయోగ్యాంగ ఉందని హర్షం వ్యక్తం చేస్తూ మోడీ చిత్ర పటానికి క్షీరాభిషేఖం చేశారు.  ఈసందర్భంగా రఘునాథ్ రావు మాట్లాడుతూ,  సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంర్హో పాటుపడుతుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆదాయ పన్ను ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పెంచడం వలన సింగరేణి కార్మికులకు ల్ ఆర్థిక ప్రయోజనము కుదురుతుందని అన్నారు. సుమారు 70 శాతం మంది కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు  వర్తిస్తుందని ఆయన వివరించారు. సింగరేణి కార్మికులు సంక్షేమం,  సంస్థ పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం తనవంతు సహాయాన్ని అందిస్తుందని రఘునాథ్ రావు ధీమా వ్యక్తం చేశారు.