పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావాలి - బిజెపి రాష్ట్ర ఇంఛార్జి సునీల్ బన్సల్

పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావాలి - బిజెపి రాష్ట్ర ఇంఛార్జి సునీల్ బన్సల్

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన పట్టుదల రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా చూపి పార్టీ విజయానికి కృషి చేయాలని బిజెపి రాష్ట్ర ఇంఛార్జి సునీల్ బన్సల్ ఉద్బోధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమీక్షతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సన్నాహక సమావేశం నిర్మల్ లో జరిగింది. ఇందులో  భాగంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి  క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన  రాష్ట్ర ఇంఛార్జి సునీల్ బన్సల్ కు మహేశ్వర్ రెడ్డి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం క్యాంప్ కార్యాలయం లో సమావేశం నిర్వహించి ఇటీవల ముగిసిన  అసెంబ్లీ ఎన్నికల పై సమీక్ష తో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సన్నాహక సమావేశం నిర్వహించారు. మరి కొద్ది మాసాల్లో లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్నందున నాయకులు కార్యకర్తలు ప్రతీ ఒక్కరూ సమిష్టి గా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రేమేందర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, అయ్యన్న గారి భూమయ్య, రావుల రాం నాథ్, అంజుకుమార్ రెడ్డి, మల్లారెడ్డి, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి తో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.