ఆటో బోల్తా ప్రయాణికులకు గాయాలు.. ...

ఆటో బోల్తా ప్రయాణికులకు గాయాలు.. ...

ఇద్దరి పరిస్థితి విషమం.. ... ఆసుపత్రికి తరలింపు..

మెట్‌పల్లి ముద్ర: ఆటో బోల్తా పడి ప్రయాణికులకు గాయాలైన సంఘటన పట్టణ శివారులో జరిగింది. మెట్‌పల్లి పట్టణం నుండి మండలంలోని జగ్గసాగర్ గ్రామానికి ప్రయాణికులతో వెళుతున్న ఆటో పట్టణ శివారులోని బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ వద్ద కుక్కను తప్పించబోయి బోల్తా పడింది ఈ సంఘటనలో ఆటోల ప్రయాణిస్తున్న కమల, లాస్య, వనిత, బుచ్చమ్మ, బావాయి, అరుణ, భూదేవి తో పాటు 7 నెలల చిన్నారి కృతి లకు గాయాలు కాగా వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కమల, లాస్య లకు తలకు తీవ్రగాయాలు కాగా పరిస్తితి విషమంగా ఉండడంతో వీరిని జగిత్యాల ఆసుపత్రికి ఒకరిని, నిజామాబాద్ ఆసుపత్రికి ఒకరిని తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి  సంఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. క్షతగ్రతులను సీ ఐ లక్ష్మి నారాయణ, ఎస్ ఐ చిరంజీవి లు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.