ఈటెలను కలిసిన పత్తి శ్రీనివాస్

ఈటెలను కలిసిన పత్తి శ్రీనివాస్

రామకృష్ణాపూర్, ముద్ర: పట్టణానికి చెందిన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్ హుజురాబాద్ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీతో నియోజవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈటెలతో శ్రీనివాస్ చర్చించారు. ఈ సందర్బంగా పత్తి శ్రీనివాస్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాల ఉపసర్పంచ్ డేగ నగేష్, చెన్నూరు పట్టణ అధ్యక్షుడు సుశీల్ కుమార్, రామకృష్ణాపూర్ పట్టణ ఉపాధ్యక్షుడు జంగపెల్లి మల్లయ్య,శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు వీరమల్ల రాజయ్య, బీజేవైఎం పట్టణ  అధ్యక్షుడు కున్సోత్ సంతోషం రామ్, రామ్ కిషోర్,ఇతర లీడర్లు పాల్గొన్నారు.