పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: మంత్రి దాడిశెట్టి రాజా

పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: మంత్రి దాడిశెట్టి రాజా

విజయవాడ:తుని రైలు దహనం కేసు ఘటనలో మంత్రి దాడిశెట్టి రాజా,సినీనటుడు జీవా, ఇతర కాపు నాయకులు సోమవారం ఉదయం విజయవాడ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా  మాట్లాడుతూ... మూడు నెలల తర్వాత పవన్ కళ్యాణ్  బయటికొచ్చి హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలు, కాపులు కలిసి రాజ్యాధికారం చేపట్టాలని మాట్లాడుతున్నారన్నారు.

బీసీలకు రాజ్యాధికారం అంటే చంద్రబాబు పల్లకీ మోయడమేనా అని వ్యాఖ్యలు చేశారు. కొత్తగా చంద్రబాబుతో కలిసి ఉన్నట్లు పవన్ మాట్లాడుతున్నారన్నారు. 2014 నుంచి చంద్రబాబుతో పవన్ కలిసే ఉన్నారని స్పష్టం చేశారు. పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు, చంద్రబాబుకు కాపులు ఓటేయకపోతే బీసీలు బానిసలైపోతారనేలా పవన్ మాట్లాడుతున్నారని అన్నారు.