క్రీడలతో శరీరక దృఢత్వం

క్రీడలతో శరీరక దృఢత్వం

ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

తూప్రాన్ :ముద్ర:క్రీడలతో  శరీరక దృఢత్వం ఏర్పడుతుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం మనోహరాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సిఎం కప్ క్రీడా పోటీలను సర్పంచ్ ల ఫోరమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డితో కలిసి అయన ప్రారంభించారు. మాసాయిపేట మండల కేంద్రంలో తూప్రాన్ డిఎస్పి యాదగిరి రెడ్డి సిఎం కప్ క్రీడాపోటిలను ప్రారంభించారు. యువత క్రీడలలో రాణించడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం ఏర్పడుతుందన్నారు. క్రీడాకారులు మండల స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీత రవి, పాక్స్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.