రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైన పోచంపల్లి విద్యార్థులు
![రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైన పోచంపల్లి విద్యార్థులు](https://mudranews.in/uploads/images/2023/11/image_750x_6555f7a4c975a.jpg)
భూదాన్ పోచంపల్లి, ముద్ర;భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు గురువారం నడిగూడెం లో జరిగిన జిల్లా స్థాయి ఫుట్బాల్ పోటీల్లో గెలుపొంది రాష్ట్రస్థాయి పోటీలకు అండర్ 17 కేటగిరిలో అక్షిత, అండర్ 14 కేటగిరీలలో మనిషా, మేఘన లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ త్వరలో గద్వాల్ లో జరగనున్న రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు పోచంపల్లి విద్యార్థులు ఎంపిక కావడం సంతోషదాయకమని అన్నారు .విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు .అనంతరం జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పిడి భావన తదితరులు పాల్గొన్నారు.