పొంగులేటి విందు రాజకీయం

పొంగులేటి విందు రాజకీయం

రాష్ట్ర బిజెపి చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే రఘునందనరావు మరి కొందరు బీజేపీ నాయకులు గురువారం మధ్యాహ్నం ఖమ్మం వచ్చారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇటీవల పొంగులేటిని బి(టి)ఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పొంగులేటిని బిజెపి ఆహ్వానించేందుకు ఈటెల రాజేందర్ బృందం ఆయన ఇంటికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  ఈ అంశం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. తాను ఏ పార్టీలో వెళ్తానని పొంగులేటి ప్రకటించినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తొమ్మిది ప్రాంతాల్లో ఆయన ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేశారు. పల నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను సైతం ప్రకటించారు. కొద్దిరోజుల వరకు కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ గురువారం పొంగులేటి ఇంటికి బిజెపి నేతలు రావడంతో కాషాయం వైపు ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.