ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు...

ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- విజయవాడ కేసరపల్లి ఐటీ పార్కులో ఈ నెల 12న జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి ఉదయం 8.20 గంటలకు బయలుదేరి 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు విమానంలో భువనేశ్వర్‌కు బయలుదేరుతారు.