సముద్రాల శ్రీనును పరామర్శించిన పుట్ట మధు

సముద్రాల శ్రీనును పరామర్శించిన పుట్ట మధు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: కరీంనగర్ పట్టణంలోని అపోలో రిచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మంథని పట్టణానికి చెందిన ఆర్యవైశ్య అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సముద్రాల శ్రీను అనారోగ్యంతో బాధపడుతూ నాలుగు రోజుల క్రితం కరీంనగర్ దావకానలో చికిత్స పొందుతుండగా, శుక్రవారం మంథని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు శ్రీనును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. పుట్ట మధు వెంట మంథని కేడిసిసి బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.