నిబద్దతతో పనిచేసే సిబ్బందికి రథచక్ర పురస్కారాలు

నిబద్దతతో పనిచేసే సిబ్బందికి రథచక్ర పురస్కారాలు
  • డిప్యూటీ ఆర్ఎం జగన్
  • పట్నం డిపో ఆర్టీసీ సిబ్బందికి పురస్కారాలు అందజేత

ముద్ర ప్రతినిధి, ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ డిపోకు ఆదాయం సమకూర్చుతూ నిబద్దతతో పనిచేసే సిబ్బందికి రథచక్ర పురస్కారాలు అందజేస్తున్నట్లు ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ జి జగన్ తెలిపారు. గురువారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో జనవరి నెలకు సంబంధించి ప్రగతి రథచక్ర పురస్కారాలు అందజేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ  ఎక్కువ ఆక్యూపెన్సితో పాటు, ఇంధనాన్ని ఆదాచేసే డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు అందజేస్తున్నట్లు చెప్పారు. మిగతా ఉద్యోగులు అవార్డులు అందుకున్న వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ నెల 19వ తేదీ నుండి మేడారం జాతర స్పెషల్ ఆపరేషన్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మేడారం వెళ్లే డిపోకు చెందిన బస్సులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ బి వెంకట్ నర్సప్ప, ఏఎంటి సరస్వతి, ఏఈఎం సత్తయ్య, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.