అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట జిల్లా మోతె మండలం మావిళ్ళగూడెం వద్ద ఆర్టీసీ బస్సు రాజధాని అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకుపోయింది.ముందు వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పగలడంతో వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఘటన జరిగింది.డ్రైవర్ అప్రమత్తతతో  పెను ప్రమాదం తప్పింది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.