ఇంటర్ ఫలితాల్లో రేస్ కోదాడ రాష్ట్ర స్థాయి ర్యాంకు ల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో రేస్ కోదాడ రాష్ట్ర స్థాయి ర్యాంకు ల ప్రభంజనం

కోదాడ, ముద్ర:తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కోదాడ పట్టణంలోని రేస్ ఐఐటి, మెడికల్ అకాడమీ కి చెందిన ముగ్గురు విద్యార్థులు   రాష్ట్రస్థాయిలో సెకండ్ ర్యాంకు సాధించినట్లు కళాశాల చైర్మన్ బాణాల వసంత వెంకట్ రెడ్డి మంగళవారం తెలిపారు. జూనియర్ ఎంపీసీవిభాగంలో కళాశాలకు చెందిన గుడవర్తి హర్షిని 466/470, కంచర్ల అక్షర 466/470, నెల్లూరి స్రవంతి 466/470, జూనియర్ బైపీసీ విభాగంలో షేక్ రుక్సానా 431/440 , సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఉయ్యాల అక్షర సమైక్య 991 /1000, వేమూరి రామ్ చరణ్ 991/1000, సీనియర్  బైపిసి విభాగంలో కుందూరి హరిణి 983/1000  మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయిలో జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్. మెడికల్ విభాగంలో  ర్యాంకులు సాధించడంతోపాటు, రాష్ట్రస్థాయిలో ఇంటర్ విభాగంలో
ఉన్నతమైన ర్యాంకులు సాధిస్తున్నామని, భవిష్యత్తులో రానున్న ఫలితాలలో కూడా మా సంస్థ ముందంజలో ఉంటుందని తెలిపారు, విద్యార్థుల ర్యాంకులకు కృషిచేసిన అధ్యాపకులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె. కృష్ణారావు, కళాశాల డీన్ ఆర్కె,నరసింహారెడ్డి, ఎం జి రెడ్డి, రవితేజ, శేషాద్రి, జియావుద్దీన్ అడ్వకేట్ ఉయ్యాల నరసయ్య, వేమూరి కృష్ణయ్య , అడ్వకేట్ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.