కోరుట్లలో రాజ శ్యామల సహిత చండీ హోమం

కోరుట్లలో రాజ శ్యామల సహిత చండీ హోమం

ముద్ర, కోరుట్ల:కోరుట్ల శ్రీ త్రిశక్తి మాత దేవాలయంలో ఆదివారం గణేశ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ సందర్భంగా ఆలయంలో సామూహిక రాజశ్యామల సమేత చండీ హోమం ను  అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ హోమంలో 50 మంది జంటలు పాల్గొన్నారు. అనంతరం అలయ నిర్వాహకులు హోమం ల్లో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గణేశ నవదుర్గ మండలి అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి ఆడువాల ప్రభాకర్, సభ్యులు విజయ్, కార్తీక్, ఆలయ అర్చకులు పాలెపు శివ, రోహిత్ పాండే మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.