మిస్ ఇండియా-2023 గా రాజస్థాన్ సుందరి నందిని

మిస్ ఇండియా-2023 గా రాజస్థాన్ సుందరి నందిని

ఇంఫాల్:  రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల  నందినీ గుప్తా మిస్ ఇండియా 2023 గా ఎంపికైంది. మణిపూర్ రాజధాని ఇంపాల్ లో గత రాత్రి కన్నుల పండుగగా జరిగిన వేడుకలో నందిని మిస్ ఇండియా గా ఎంపికైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఢిల్లీకి చెందిన శ్రేయా ఫుంజా ద్వితీయ స్థానంలోనూ, మణిపూర్ సుందరి తోనాజం స్ట్రీలా లువాంగ్ తృతీయ స్థానంలో నిలిచారు.

బిజినెస్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ చదువుతున్న నందిని చిన్నప్పటి నుంచే  సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతూ వచ్చింది. గొప్ప వ్యాపార దక్షుడు, దాత రతన్ టాటాకు నందిని అభిమాని. మాజీ ప్రపంచ సుందరి (2000),  నటి, నిర్మాత అయిన ప్రియాంక చోప్రా అంటే నందినికి ఇష్టం. ప్రియాంక చోప్రా సాధించిన విజయాలు సమాజానికి సేవ చేయాలన్న ఆమె గొప్ప ఆశయం తనను ఆమె అభిమానిగా మార్చాయని నందిని చెబుతోంది.