మంచిర్యాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గా రాజేశం

మంచిర్యాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గా రాజేశం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా ప్రముఖ వ్యాపారవేత్త కొత్త రాజేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం వైశ్య భవన్లో ఎన్నికల ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఎవరు అధ్యక్ష పదవికి పోటీ పడకపోవడంతో నామినేషన్ దాఖలు చేసిన రాజేశం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన చిలువేరు శ్రీనివాస్,  చిలువేరు రమేష్, కెశెట్టి వంశీకృష్ణ కొత్త రాజేశంను అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా గంప శేఖర్ , కోశాధికారిగా కొత్త జయప్రకాశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుండం అశోక్  నియమితులయ్యారు. ఈసందర్భంగా రాజేశం మాట్లాడుతూ తనపై విశ్వాసంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా సంఘం సేవా కార్యక్రమాలను విస్తృత పరుస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు రేణిగుంట్ల శ్రీనివాస్ ,నాయకులు ముక్త శ్రీనివాస్ , మున్సిపల్ కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ, చిలువేరు వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.