ముస్లీం లకు రంజాన్ కానుక

ముస్లీం లకు రంజాన్ కానుక

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు నిరుపేద ముస్లీం లకు రంజాన్ కానుకను పంపిణీ చేశారు. శనివారం షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ పరంగా ఎంపికైన వెయ్యి మంది ముస్లీంలకు రంజాన్ కానుకను ఎమ్మెల్యే అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేద ముస్లీం కుటుంబాలకు తమవంతు సాయం చేయాలనే సదాశయంతో రంజాన్ కానుకను ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్ లు, బీఆరెస్ నేతలు పాల్గొన్నారు.