సిఎం కేసీఆర్ నాయకత్వం లో అభివృద్ధి పధంలో రామగుండం
![సిఎం కేసీఆర్ నాయకత్వం లో అభివృద్ధి పధంలో రామగుండం](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_651bfe740233a.jpg)
- ఎమ్మెల్యే కోరుకంటి చందర్
ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:-సిఎం కేసీఆర్ నాయకత్వం లో అభివృద్ధి పధంలో రామగుండం నియోజకవర్గం పరుగెడుతుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 48, 49 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లలో అధిక మెత్తంలో నిధులను కెటాయుస్తు ప్రతి డివిజన్లో సమస్యలు పరిస్కారం చేశామన్నారు. రామగుండం కార్పొరేషన్లో ఎక్కడ చిన్న సమస్య ఉన్నా పరిస్కారం చేసే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడకముందు మహిళలు మంచినీటి కోసం బిందెలతో రోడ్లపైకి వచ్చి పోరాటం చేసే పరిస్థితులుండేవని నేడు ఆ పరిస్థితులు లేవన్నారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ పోన్నం దివ్య లక్ష్మన్, బాల్ రాజ్ కుమార్, కో అప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్, గౌస్, రఫీక్ నాయకులు తానిపర్తి గోపాల్ రావు, నూతి తిరుపతి, మండ రమేష్ గౌడ్ కాంపెల్లి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.