మూడేళ్లలో 15 ఉద్యోగాలు సాధించిన రామావత్ మధుసూదన్.

మూడేళ్లలో 15 ఉద్యోగాలు సాధించిన రామావత్ మధుసూదన్.

ముద్ర న్యూస్ నేరేడుచర్ల: మండల కేంద్రానికి చెందిన రామావత్ మధుసూదన్ ఇటీవల వెలువడిన ఐబీపీఎస్ ఫలితాలలో పిఓ కేడర్లో కెనరా బ్యాంకులో ఉద్యోగాన్ని సాధించాడు. మధుసూదన్ ఇంతకుముందు వివిధ శాఖలలో 15 ఉద్యోగాలు సాధించినప్పటికీ ఉన్నత ఉద్యోగం లక్ష్యంగా ఏ ఉద్యోగంలో చేరలేదని తెలిపారు, ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ సిజిఎల్ లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సన్నిదమవుతున్నట్లు పేర్కొన్నాడు, తండ్రి పాండు నాయక్ వ్యవసాయం చేస్తుండగా తల్లి నాగమణి స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయాలు సాధిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పలువురు పుర ప్రముఖులు మధుసూదన్ కు అభినందనలు తెలిపారు.