అవిశ్వాసానికి ముందే ఎంపిపి పదవికి రాజీనామా

అవిశ్వాసానికి ముందే ఎంపిపి పదవికి రాజీనామా

ముద్ర ప్రతినిధి , కోదాడ:- కోదాడ ఎంపిపి చింత కవిత తన పదవికి రాజీనామా చేసింది . అవిశ్వాసానికి ముందే తన పదవికి రాజీనామా చేసి అందరిని ఆశ్చర్య పరిచింది. సోమవారం సీఈఓ సురేష్ కుమార్ కు తన రాజీనామా లేఖ ను అందజేసింది . ఇప్పటికే కోదాడ మండల ఎంపిటిసి లు తాజాగా ఎంపిపి చేసిన అవినీతిని వెలికితీయాలంటూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఆదేశానుసారం విచారణ పూర్తి చేసిన అధికారులు నివేదికను కలెక్టర్ కు అందించారు . నివేదిక పై చర్యలు తీసుకోకముందే ఎంపిపి తన పదవికి రాజీనామా చెయ్యడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .