విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై హృదయవిదారక ఘటన

విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై హృదయవిదారక ఘటన

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-పాపం ఇలాంటి దుస్థితి ఏ పసివాడికీ రాకూడదు. అసలేం జరిగిందంటే.. రాజమండ్రి కి చెందిన శెట్టి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి పది రోజుల క్రితం తల్లి, భార్య, ఇద్దరు కుమారులతో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. పాల ప్యాకెట్ కోసమని దుర్గా ప్రసాద్ తన రెండేళ్ల కుమారుడితో కలిసి రోడ్డుకు వచ్చాడు. అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ వద్ద బైక్‌ను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. దుర్గా ప్రసాద్ అక్కడి కక్కడే మరణించాడు. ఒంటినిండా గాయాలతో రెండేళ్ల చిన్నారి ఏడుస్తూ తండ్రి మృతదేహం వద్ద కూర్చొండిపోయాడు. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.