ప్రైవేటు బస్సు బోల్తా - 28 మందికి గాయాలు

ప్రైవేటు బస్సు బోల్తా - 28 మందికి గాయాలు
  • ఒకరు మృతి - ఇద్దరి పరిస్థితి విషమం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 28 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న ముస్కాన్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తోంది.

ఈ క్రమంలో ముందు వెళుతున్న కారు ను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో క్షతగాత్రులైన వారిని నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.  ఆదిలాబాద్ కు చెందిన ఫర్హానా (27) హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. కాగా కాంగ్రెస్ నాయకులు అర్జుమంద్, జునైద్ మెమన్ లు ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు.