రోడ్డు భద్రత మనందరి బాధ్యత - శంషాబాద్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి

రోడ్డు భద్రత మనందరి బాధ్యత -  శంషాబాద్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి

షాద్ నగర్, ముద్ర ప్రతినిధి: రహదారి భద్రత మనందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని శంషాబాద్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు సంధర్బంగా మంగళవారం షాద్ నగర్ పోచమ్మ దేవాలయం నుండి షాద్ నగర్ ఎక్స్‌రోడ్ వరకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం దృష్ట్యా బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, మద్యం తాగివాహనాలు నడుపరాదన్నారు. డ్రైవింగ్‌ సమయంలో నిర్లక్ష్యం పనికి రాదని ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు, వెనక కూర్చున్న వారు కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. షాద్‌నగర్ సీఐ ప్రతాప్ లింగం, షాద్ నగర్ ఎంవీఐ బాలు నాయక్, ఎస్ఐ రవీందర్నాయక్  పాల్గొన్నారు.