బండి సంజయ్కు మరోసారి నోటీసులు ఇచ్చిన సిట్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26న సిట్ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇదివరకే సిట్ అధికారులు బండి సంజయ్కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఈ నెల 24న రాలేనని ఆయన సిట్ అధికారులకు లేఖ రాశారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు.