రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి ఎస్పీ సంతాపం

రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి ఎస్పీ సంతాపం

ముద్ర ప్రతినిధి, వనపర్తి : పెద్దమందడి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ బుధవారం రోడ్ ప్రమాదం లో మరణించిన కానిస్టేబుల్ బాలరాజు pc no 3195 కుటుంబానికి గురువారం ఆయన స్వగ్రామం శ్రీనివాసపురం లో ఎస్పీ శ్రీమతి రక్షిత కె మూర్తి నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు. తన చేతుల మీదుగా అంత్యక్రియ ఖర్చులకు గాను 20,000/- రూపాయల నగదును అందజేశారు. పోలీసు సంక్షేమం విభాగం నుండి ఈ నగదును వారి కుటుంబానికి అందజేసినట్లుగా తెలియజేశారు. కానిస్టేబుల్ సతీమణి మంజుల ను ఎస్పీ ఓదారుస్తూ తనకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియజేసినారు.

పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలని కోరారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ రామదాసు తేజావత్, డిఎస్పి ఆనంద రెడ్డి, వనపర్తి టౌన్ సిఐ మహేశ్వర్, కొత్తకోట సీఐ శ్రీ శ్రీనివాస రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పలనాయుడు టౌన్ ఎస్సై , పెద్దమందడి ఎస్ఐ కొత్తకోట ఎస్సై లు, ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు వెంకటయ్య, జిల్లా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.