చిన్నారెడ్డిని సన్మానించిన సాదిక్ బృందం 

చిన్నారెడ్డిని సన్మానించిన సాదిక్ బృందం 

ముద్ర , షాద్ నగర్: రాష్ట్ర ప్రణాళిక సంఘం బోర్డు ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి నియమితులైన సంధర్భంగా షాద్ నగర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ తమ బృందం నవాజ్ గోరి, ఖాదర్ గోరితో కలసి సన్మానించారు..ఈ సంధర్భంగావారు మాట్లాడుతూ.. కేబినెట్ మంత్రి హోదాలో చిన్నారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరమని పేర్కోన్నారు. రాజకీయాలకు అతీతంగా డాక్టర్ చిన్నారెడ్డి అందరితో కలివిడిగా ఉంటు అందరివాడిగా పేరొందరని వివరించారు. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గోపాల్ పేట మండలం జయన్న తిరుమలపూర్ గ్రామానికి చెందిన జిల్లెల చిన్నారెడ్డి 1955లో జన్మించారనీ, ఉన్నత పాఠశాల విద్య వరకు వనపర్తిలో చదువుకున్నారు. 1970లో విద్యార్థి సంఘ నాయకుడిగా, ఆ తరువాత 1985 లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతగా ఉంటూ వనపర్తి టికెట్ సాధించి పోటీ చేసి ఓటమిపాలయ్యారనీ మళ్లీ 1989లో పోటీచేసి మొదటిసారి గెలుపొందారని. 2004లో వైఎస్ఆర్ మంత్రి వర్గంలో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేశారని వివరించారు. చిన్నారెడ్డి గారు మరింత ఎత్తుకు ఎదగాలని వారు అభిప్రాయపడ్డారు